అంబేద్కర్ స్పూర్తితో చదువుకోండి – ఎదగండి.

వేంసూరు ఎస్సీ వసతిగృహంలో అంబేద్కర్ జయంతి.

అంబేద్కర్ స్పూర్తితో చదువుకోండి – ఎదగండి.

సత్తుపల్లి, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వేంసూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతిగృహంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వసతిగృహ సంక్షేమ అధికారి డాక్టర్ తిమ్మిడి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. దేశ అభివృద్ధి కోసం ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం పట్ల ఆయన చూపిన మార్గదర్శకత్వాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని వివరించారు. “చదువుకోండి – ఎదగండి” అనే అంబేద్కర్ సందేశాన్ని గుర్తు చేస్తూ, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి వ్యక్తిగా ఎదగాలని సూచించారుIMG-20260414-WA0109. ఈ కార్యక్రమంలో వసతిగృహ విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .