పెద్దమందడిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటం ఆవిష్కరణ.
పెద్దమందడి,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు):
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ హై స్కూల్ సమీపంలో పార్లమెంట్ భవనం మరియు అంబేద్కర్ చిత్రపటాలను ఏర్పాటు చేశారు.ఈ చిత్రపటాలను 1992 పదవ తరగతి బ్యాచ్కు చెందిన పానుగంటి కుర్మయ్య స్వంతంగా రూ.20,000/- రూపాయల వ్యయంతో వేయించారు.అనంతరం గ్రామ సర్పంచ్ గంగమ్మ రవి చేతుల మీదుగా అంబేద్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.అంబేద్కర్ ఆశయాలను అందరూ ఆచరించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఐ సత్యారెడ్డి, కొమ్ము వెంకటస్వామి, సేనాపతి, గ్రామ సెక్రటరీ దిలీప్ రెడ్డి, సింగిరెడ్డి కురుమూర్తి, రాఘవేంద్ర, రామాంజనేయులు, వార్డు సభ్యులు కొమ్మ బ్రహ్మయ్య, కొమ్ము విష్ణు, కొమ్ము సత్యనారాయణ, కొమ్ము శివ కుమార్, గుడిసె మల్లేష్, జంగం శివ, స్వామి తదితరులు పాల్గొన్నారు.


Comments