గొర్రెల కాపరుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి .

నాగేంద్ర యాదవ్.

గొర్రెల కాపరుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి .

మహబూబ్‌నగర్ ,ఏప్రిల్13(తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు ప్రభుత్వాన్ని గొర్రెల కాపరుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బీపీ మండల్ వర్ధంతిని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ చేసి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.నాయకులు మాట్లాడుతూ గొర్రెలకు బీమా సదుపాయం కల్పించడం, ఎన్‌సీడీసీ రుణాలను మాఫీ చేయడం, రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేయడం వంటి డిమాండ్లను ముందుకు తెచ్చారు. ప్రతి మండలంలో గొర్రెల–మేకల మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయడం, పశువైద్య సబ్ సెంటర్లను బలోపేతం చేసి సిబ్బందిని నియమించడం అవసరమని పేర్కొన్నారు.భూమిలేని గొర్రెల కాపరులకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ కల్పించాలని, పట్టణ ప్రాంతాల్లో 50% సబ్సిడీపై పశువులను అందించాలని, ఎన్‌ఎల్‌ఎం పథకంలో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతయ్య యాదవ్, జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహ యాదవ్, నాగేంద్ర యాదవ్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అంబేద్కర్ అందరివాడు అంబేద్కర్ అందరివాడు
హన్మకొండ,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో వరంగల్ పార్లమెంట్...
పామిరెడ్డిపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ ఆశయాల సాధనతోనే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యం .
యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలి.
చిన్నపెండ్యాలలో  ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు.
మేడ్చల్–మల్కాజిగిరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు.