గొర్రెల కాపరుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి .

నాగేంద్ర యాదవ్.

గొర్రెల కాపరుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి .

మహబూబ్‌నగర్ ,ఏప్రిల్13(తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు ప్రభుత్వాన్ని గొర్రెల కాపరుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బీపీ మండల్ వర్ధంతిని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ చేసి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.నాయకులు మాట్లాడుతూ గొర్రెలకు బీమా సదుపాయం కల్పించడం, ఎన్‌సీడీసీ రుణాలను మాఫీ చేయడం, రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేయడం వంటి డిమాండ్లను ముందుకు తెచ్చారు. ప్రతి మండలంలో గొర్రెల–మేకల మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయడం, పశువైద్య సబ్ సెంటర్లను బలోపేతం చేసి సిబ్బందిని నియమించడం అవసరమని పేర్కొన్నారు.భూమిలేని గొర్రెల కాపరులకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ కల్పించాలని, పట్టణ ప్రాంతాల్లో 50% సబ్సిడీపై పశువులను అందించాలని, ఎన్‌ఎల్‌ఎం పథకంలో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతయ్య యాదవ్, జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహ యాదవ్, నాగేంద్ర యాదవ్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి.
వనపర్తి,మే30(తెలంగాణ ముచ్చట్లు): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమీక్షా పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఉపశమనం కల్పించేందుకు...
ఏసీబీ ట్రాప్ కేసులో నేలకొండపల్లి పూర్వ తహసిల్దారు  నరసింహారావుకు జైలు శిక్ష.
కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. నలుగురిని హుజూరాబాద్ జైలుకు తరలింపు.
యుద్ధప్రాతిపదికన గట్ల నర్సింగాపూర్ బ్రిడ్జి నిర్మించాలి!
చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.
మహిళల ఆర్థికాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం: చైర్మన్ దిలీప్.
పెద్దమందడి మండల కేంద్రంలో తాగునీటి సమస్య.. పట్టించుకోని అధికారులు .