చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.

చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.

జమ్మికుంట టౌన్ మే 30 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో చిట్టీ డబ్బుల వివాదం ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన అరుకాల సాయికుమార్ అనే యువకుడు పురుగుమందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు.

స్థానికుల వివరాల ప్రకారం, సాయికుమార్ జమ్మికుంటకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.6 లక్షల మేర చిట్టీ డబ్బులు కట్టినట్లు తెలిసింది. అయితే గడువు ముగిసినప్పటికీ తన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, తనకు చెందిన బంగారు గొలుసు, క్రెడిట్ కార్డులను కూడా తిరిగి అందించడం లేదని అతడు ఆరోపించాడు.

ఈ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయికుమార్, “ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.. అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నాను” అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేస్తూ పురుగుమందు సేవించినట్లు సమాచారం.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి అతడిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతున్నట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి.
వనపర్తి,మే30(తెలంగాణ ముచ్చట్లు): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమీక్షా పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఉపశమనం కల్పించేందుకు...
ఏసీబీ ట్రాప్ కేసులో నేలకొండపల్లి పూర్వ తహసిల్దారు  నరసింహారావుకు జైలు శిక్ష.
కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. నలుగురిని హుజూరాబాద్ జైలుకు తరలింపు.
యుద్ధప్రాతిపదికన గట్ల నర్సింగాపూర్ బ్రిడ్జి నిర్మించాలి!
చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.
మహిళల ఆర్థికాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం: చైర్మన్ దిలీప్.
పెద్దమందడి మండల కేంద్రంలో తాగునీటి సమస్య.. పట్టించుకోని అధికారులు .