బోర్నపల్లిలో వారికోయ్యాలకు భారీ అగ్నిప్రమాదం.
Views: 2
On
హుజూరాబాద్, మే 30 (తెలంగాణ ముచ్చట్లు):
హుజూరాబాద్ మండలంలోని బోర్నపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి వారికోయ్యాలకు ఆకస్మికంగా మంటలు అంటుకుని భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు ఎగసిపడి పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.
మంటలను గమనించిన గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అయితే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పెద్ద మొత్తంలో వారికోయ్యాలు దగ్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో మంటలు కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలి . ఈ ప్రమాదం
జరిగిన వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి స్థాయి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 May 2026 21:17:28
వనపర్తి,మే30(తెలంగాణ ముచ్చట్లు):
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమీక్షా పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఉపశమనం కల్పించేందుకు...


Comments