వడ్డే కొండయ్య జ్ఞాపకార్థంగా దేవాలయానికి ఐమాక్స్ లైట్ డొనేషన్
పెద్దమందడి,మే29(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని శ్రీ సిద్ధి రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వడ్డే కొండయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు వడ్డే శ్రీనివాస్ ఐమాక్స్ లైట్ను డొనేషన్గా అందజేశారు. దేవాలయంలో భక్తులకు మరింత ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ విరాళాన్ని సమర్పించినట్లు ఐమాక్స్ లైట్ దాత శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు శివకుమార్ స్వామి మాట్లాడుతూ… వడ్డే కొండయ్య సేవాభావం కలిగిన వ్యక్తి అని, వారి జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యులు చేసిన ఈ సేవ అభినందనీయమన్నారు.దేవాలయ అభివృద్ధికి భక్తులు ముందుకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు.అలాగే వడ్డే శ్రీనివాస్ కుటుంబ సభ్యులందరికీ శ్రీ సిద్ధి రామలింగేశ్వర స్వామివారి సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.


Comments