బక్రీద్ వేళ సామరస్య సందేశం.. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్.

బక్రీద్ వేళ సామరస్య సందేశం.. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్.

హుజురాబాద్, మే 28 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం మైనారిటీ కమిటీ అధ్యక్షుడు ఎండినూరుల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ, బక్రీద్ సందర్భంగా గోవు వధకు దూరంగా ఉండాలని, హిందువుల మనోభావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
అలాగే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవ భావంతో కలిసి జీవించాలని, శాంతి సామరస్యాల పరిరక్షణకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ముస్లిం మైనారిటీ సభ్యులు, యువకులు పాల్గొని సామరస్య సందేశాన్ని చాటారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు. ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు.
ఎల్కతుర్తి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు): ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక...
తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రాన్ని విడుదల చేసిన మోత్కుపల్లి .
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.
బాల్క సుమన్‌పై ఫిర్యాదు.
ఉచిత ఆన్లైన్ విద్యను సద్వినియోగం చేసుకోండి - మాజీ ఎంపీ నామ.
ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర : మాజీ ఎంపీ నామ.