బక్రీద్ వేళ సామరస్య సందేశం.. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్.
Views: 2
On
హుజురాబాద్, మే 28 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం మైనారిటీ కమిటీ అధ్యక్షుడు ఎండినూరుల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ, బక్రీద్ సందర్భంగా గోవు వధకు దూరంగా ఉండాలని, హిందువుల మనోభావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
అలాగే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవ భావంతో కలిసి జీవించాలని, శాంతి సామరస్యాల పరిరక్షణకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ముస్లిం మైనారిటీ సభ్యులు, యువకులు పాల్గొని సామరస్య సందేశాన్ని చాటారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
28 May 2026 22:20:02
ఎల్కతుర్తి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక...


Comments