దమ్మపేట ఎస్ఐగా బి. రాజేష్ కుమార్ బాధ్యతల స్వీకారం.
సాయి కిషోర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం వి.ఆర్కు బదిలీ.
Views: 94
On
దమ్మపేట, మే 20 (తెలంగాణ ముచ్చట్లు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బి. రాజేష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన సాయి కిషోర్ రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం వి.ఆర్కు బదిలీ చేసిన నేపథ్యంలో రాజేష్ కుమార్ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్టేషన్ సిబ్బంది ఆయనకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments