ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కీలక సూచన.
ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి : కౌన్సిలర్ కొలువురు సురేష్
జమ్మికుంట టౌన్ మే 19 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పెన్షన్ల ఆధార్ అథెంటికేషన్ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో మంగళవారం ప్రత్యేక వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పెన్షన్ లబ్ధిదారుల ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేశారు.
ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ కొలువురు సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేలో ప్రతి పెన్షన్ దారుడు తప్పనిసరిగా ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాలని సూచించారు. వెరిఫికేషన్ చేయించుకోని వారి పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
పెన్షన్ పొందుతున్న వారిలో జీవించి ఉన్నవారు, మరణించినవారి వివరాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ వెరిఫికేషన్లో పాల్గొనాలని కోరారు.
అలాగే ఈరోజు అందుబాటులో లేని వారు రేపు లేదా ఎల్లుండి వరకు 8వ వార్డు కార్యాలయంలో వార్డు ఆఫీసర్ క్రాంతికుమార్ను సంప్రదించి ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ క్రాంతికుమార్, 8వ
వార్డు అధ్యక్షుడు రామంచ శ్రీకాంత్, నాయకులు కనకం చందు, నిమ్మ శ్రీనివాస్, బోయిన మధు, గుల్లి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments