ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కీలక సూచన.

ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి : కౌన్సిలర్ కొలువురు సురేష్

ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కీలక సూచన.

జమ్మికుంట టౌన్ మే 19 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పెన్షన్‌ల ఆధార్ అథెంటికేషన్ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో మంగళవారం ప్రత్యేక వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పెన్షన్ లబ్ధిదారుల ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేశారు.

ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ కొలువురు సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేలో ప్రతి పెన్షన్ దారుడు తప్పనిసరిగా ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాలని సూచించారు. వెరిఫికేషన్ చేయించుకోని వారి పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.

పెన్షన్ పొందుతున్న వారిలో జీవించి ఉన్నవారు, మరణించినవారి వివరాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ వెరిఫికేషన్‌లో పాల్గొనాలని కోరారు.

అలాగే ఈరోజు అందుబాటులో లేని వారు రేపు లేదా ఎల్లుండి వరకు 8వ వార్డు కార్యాలయంలో వార్డు ఆఫీసర్ క్రాంతికుమార్‌ను సంప్రదించి ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ క్రాంతికుమార్, 8వIMG-20260519-WA0077 వార్డు అధ్యక్షుడు రామంచ శ్రీకాంత్, నాయకులు కనకం చందు, నిమ్మ శ్రీనివాస్, బోయిన మధు, గుల్లి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉమ్మడి మండలాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డికి ఘన సన్మానం. ఉమ్మడి మండలాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డికి ఘన సన్మానం.
పెద్దమందడి,మే19(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా  పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మండలాల ఉమ్మడి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన కొత్తకాపు వెంకటేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా...
జర్నలిస్టులు ప్రజల సమస్యలకు వారధిగా నిలవాలి: ప్రణవ్ బాబు.
హుజురాబాద్‌లో ట్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.
పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం.
రైతుల నష్టాలను అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కీలక సూచన.
మక్కల కొనుగోళ్లపై రైతులకు భరోసా ఇచ్చిన వొడితల ప్రణవ్.