డెంగ్యూ నివారణలో ఆరోగ్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలి.
డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రవణ్ కుమార్.
హుజురాబాద్,మే 16(తెలంగాణ ముచ్చట్లు )
హుజురాబాద్లో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రత నిర్వహణలో ప్రతిభ కనబరిచాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. అనంతరం ఆరోగ్య సిబ్బందితో కలిసి డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు.
గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులను సమర్థవంతంగా పంచాయితీ సిబ్బందితో కలిసి ఇంటిoటికీ తిరుగుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.
ఆరోగ్య సిబ్బంది నిరంతర కృషితోనే వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం, జిల్లా ఆరోగ్య బోధకులు పంజాల ప్రతాప్ గౌడ్, సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేంద్ర రాజు, హెల్త్ అసిస్టెంట్ సత్యం తదితరులు పాల్గొన్నారు.


Comments