మోదీ పిలుపు అమలు.. సైకిల్‌పై 15వ వార్డులో పర్యటించిన చైర్మన్ దిలీప్.

మోదీ పిలుపు అమలు.. సైకిల్‌పై 15వ వార్డులో పర్యటించిన చైర్మన్ దిలీప్.

జమ్మికుంట టౌన్ మే 15 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణ పరిధిలోని 15వ వార్డులో శానిటేషన్, పరిశుభ్రత పనులను మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సైకిల్‌పై వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో జరుగుతున్న శానిటేషన్ పనులను టీం వర్క్‌తో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అవసరమైతే తప్ప బైక్‌లు, ఇతర వాహనాలు ఉపయోగించకుండా ఉండాలని సూచించారని, అందుకే తాను సైకిల్‌పై వార్డు సందర్శన నిర్వహించినట్లు చెప్పారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలికి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి, స్థానిక కౌన్సిలర్ పాతకాల మౌనిక అనిల్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ మహేష్, ఏఈ వికాస్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రాణాలు కాపాడే తొలి గంటే “గోల్డెన్ అవర్” ప్రాణాలు కాపాడే తొలి గంటే “గోల్డెన్ అవర్”
రోడ్డు ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలిమెడికవర్ వైద్యులు రాజీవ్ రెడ్డి, వేణుగోపాల్ సూచనలు* హుజురాబాద్‌, మే 15(తెలంగాణ ముచ్చట్లు ): రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రమాదం...
డీసీఎం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. జమ్మికుంటలో కేసు నమోదు.
అపర భగీరధుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి ఘన సత్కారం.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి.
దొడగుంటపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా జంగం గోపాల్ ఏకగ్రీవ ఎన్నిక.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
జమ్మికుంట మున్సిపాలిటీలో జీతాల పెంపు పేరిట లక్షల వసూళ్లు..?