మోదీ సభ విజయానికి గంట సంపత్ కృషి

బోర్నపల్లి నుండి తరలిన బీజేపీ శ్రేణులు.

మోదీ సభ విజయానికి గంట సంపత్ కృషి

హుజురాబాద్, మే 10(తెలంగాణ ముచ్చట్లు ):
 
హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయడంలో బోర్నపల్లి  బీజేపీ నాయకుడు గంట సంపత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
గంట సంపత్ ఆధ్వర్యంలో ఆదివారం బోర్నపల్లినుంచి ప్రత్యేక బస్సులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు భారీగా హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మోదీకి మద్దతుగా నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ప్రయాణం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గంట సంపత్ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు నరేంద్ర మోదీ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వర్గ ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభ చారిత్రాత్మక విజయంగా నిలవాలని, తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News