రోడ్లపై పంటలు ఆరబెట్టడమే ఇద్దరి మృతికి కారణమా..?

అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు..

రోడ్లపై పంటలు ఆరబెట్టడమే ఇద్దరి మృతికి కారణమా..?

జమ్మికుంట టౌన్ మే 08 (తెలంగాణ ముచ్చట్లు):
 
కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని వల్గాపూర్ – జగ్గయ్యపల్లె మధ్య గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
స్థానికుల కథనం ప్రకారం, బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తుండగా రహదారిపై ఉన్న ఎడ్లబండిని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వేళల్లో రహదారులపై వరి ధాన్యం, మక్కజొన్న పంటలు ఆరబెట్టడం, సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం వంటి కారణాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై తెలంగాణ రైతు సహాయ జిల్లా స్థాయి సహకార కార్యదర్శి చెల్పూరి రాములు తీవ్రంగా స్పందించారు. రహదారులను పంటల ఆరబెట్టే ప్రదేశాలుగా మార్చడం వల్ల అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని మండిపడ్డారు. రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ, మార్కెట్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
రోడ్లపై పంటలు ఆరబెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని, ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రహదారులపై పంటలు ఆరబెట్టకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని, IMG-20260508-WA0085మృతి చెందిన కుటుంబాలకు తగిన సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

డిమాండ్ల సాధనకు వీఓఏల సమ్మె బాట. డిమాండ్ల సాధనకు వీఓఏల సమ్మె బాట.
- ఎమ్మెల్యే మట్టా రాగమయికి వినతిపత్రం. - ఐదు మండలాల వీఓఏల డిమాండ్.   సత్తుపల్లి, మే 9(తెలంగాణ ముచ్చట్లు):   తెలంగాణ రాష్ట్రంలోని వీఓఏల సమస్యల పరిష్కారం కోరుతూ...
ఉపాధి హామీ పనిలో విషాదం.. గుండెపోటుతో కూలీ మృతి.
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి.
చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం.
రాజకీయ పురిటి గడ్డపై తుమ్మల 40 వసంతాల వేడుకలు.
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా రక్తదాతలకు సన్మానం.
రోడ్లపై పంటలు ఆరబెట్టడమే ఇద్దరి మృతికి కారణమా..?