ఉపాధి హామీ పనిలో విషాదం.. గుండెపోటుతో కూలీ మృతి.
Views: 0
On
వేలేరు, మే 9(తెలంగాణ ముచ్చట్లు):
హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని షోడశపల్లి గ్రామానికి చెందిన కీర్తి కొమురయ్య ఉపాధి హామీ పథకం ( 100 )రోజుల పనిలో భాగంగా ఎర్రకుంట చెరువులో శనివారం పని చేస్తుండగా విషాదం చోటుచేసుకుంది.
రోజువారీ కూలీ పనులు నిర్వహిస్తున్న సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలినట్లు తోటి ఉపాధి కూలీలు తెలిపారు. వెంటనే స్పందించిన సహచరులు చికిత్స కోసం తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుడు కీర్తి కొమురయ్య కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఉపాధి కూలీలు మరియు గ్రామస్థులు కోరుతున్నారు.
అధికారులు వేసవి కాలంలో ఉపాధి పనుల సమయంలో కూలీల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
09 May 2026 17:27:53
- ఎమ్మెల్యే మట్టా రాగమయికి వినతిపత్రం.
- ఐదు మండలాల వీఓఏల డిమాండ్.
సత్తుపల్లి, మే 9(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలోని వీఓఏల సమస్యల పరిష్కారం కోరుతూ...


Comments