తిరిగి బాధ్యతలు చేపట్టిన పెద్దమందడి సింగిల్ విండో పాలకమండలి.
హర్షం వ్యక్తం చేసిన అధ్యక్షులు, డైరెక్టర్లు.
Views: 6
On
పెద్దమందడి,మే8(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి వ్యవసాయ సింగిల్ విండో పాలకమండలి సమావేశం శుక్రవారం నిర్వహించారు.ఇటీవల సింగిల్ విండో పాలకమండలిని ప్రభుత్వం రద్దు చేయగా, ఆ నిర్ణయంపై హైకోర్టు తీర్పు వెలువడింది.అనంతరం తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించిన పాలకమండలి సభ్యులు సమావేశం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం పాలకమండలి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.సహకార సంఘాల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు మాట్లాడుతూ.. తిరిగి బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.రైతుల ప్రయోజనాల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.సమావేశంలో సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్, పాలకమండలి సభ్యులు నరేష్, రామ్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సుందరమ్మ, వెంకటయ్య, మన్నెంకొండ,సీఈవో సుధాకర్, సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments