పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి

పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి

ఎల్కతుర్తి, ఏప్రిల్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
 
మండలంలోని దామేర గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
స్థానిక ఎస్సై ఇ. నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం, దామేర గ్రామానికి చెందిన వంగ అనిల్, అనిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం చిన్న కుమారుడు మనవిత్ యాదవ్ (3) ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. కాటు వేసిన విషయాన్ని బాలుడు తల్లికి తెలియజేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, సిబ్బంది వేగంగా స్పందించి బాలుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు పరిశీలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న వయస్సులోనే బాలుడు ప్రాణాలు కోల్పోవడం గ్రామస్తులను తీవ్ర దిగ్రాంతికి గురి చేసింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Tags:

Post Your Comments

Comments

Latest News

గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన. గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.
దమ్మపేట, ఏప్రిల్‌ 26(తెలంగాణ ముచ్చట్లు):   మండలంలోని మారుమూల కొండరెడ్డ్ల గిరిజన గ్రామాలైన పూసుకుంట, కట్కూరులో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో...
హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చే కుట్ర ఆపాలి: జక్కని సంజయ్
శుభకార్యాల వేళ ఆయిల్ సంక్షోభం.!
రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎరువుల దుకాణాల బంద్
స్వీయ కథా రచన పోటీల్లో శ్రీ ఆదర్శ విద్యార్థుల ప్రతిభ 
ప్రపంచ శిల్ప కళా దినోత్సవం సందర్భంగా సాంప్రదాయ శిల్పులకు ఘన సన్మానం
పెట్రోల్ డీజిల్ కొరతపై ఎంపీ వద్దిరాజు స్పందన