అల్వాల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి .

వెంకట్ రెడ్డి అల్వాల గ్రామ రైతు .

అల్వాల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి .

పెద్దమందడి,ఏప్రిల్(25తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన రైతు వెంకట్ రెడ్డి  వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తమ పంటను ఎక్కువకాలం నిల్వ ఉంచడం కష్టమవుతోందని రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని తెలిపారు.రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికే పంట కోత పూర్తయినప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. దీంతో దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

ఖచ్చిత గణన లక్ష్యంగా జమ్మికుంటలో సెన్సెస్-2027 శిక్షణ తరగతులు ప్రారంభం. ఖచ్చిత గణన లక్ష్యంగా జమ్మికుంటలో సెన్సెస్-2027 శిక్షణ తరగతులు ప్రారంభం.
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 25 (తెలంగాణ ముచ్చట్లు):   జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెన్సెస్-2027 గృహ గణనకు సంబంధించి శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న...
ఆధ్యాత్మిక సందేశాలతో అలరించిన హిందూ సమ్మేళనం
పోలీస్ స్టేషన్ ఆవరణలో కోతుల సందడి.
హుజురాబాద్‌లో ఆర్టీసీ బస్సుల రాకతో ప్రయాణికుల హర్షం.
రాష్ట్ర శిక్షణతో ఉద్యమాలకు కొత్త ఉత్సాహం
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.
ఆర్ ఎస్ విమర్శలు సిగ్గుచేటుకొలిపాక సతీష్.