విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి.
Views: 3
On
పెద్దమందడి,ఏప్రిల్25(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.అమ్మపల్లి గ్రామానికి చెందిన మోల్గరి హనుమంత్ రెడ్డి (65) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, శనివారం ఉదయం ఇంటి వద్ద నీళ్ల మోటర్ ఆన్ చేస్తుండగా అనుకోకుండా విద్యుత్ షాక్ తగిలింది.ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కొత్తకోటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.అనంతరం మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.తర్వాత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
25 Apr 2026 21:54:34
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెన్సెస్-2027 గృహ గణనకు సంబంధించి శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న...


Comments