సత్తుపల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.
- భారీ ర్యాలీ… విగ్రహానికి నివాళులు అర్పించిన
- మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.
సత్తుపల్లి, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సత్తుపల్లిలో మంగళవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్ స్టాండ్ సెంటర్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహం వరకు కొనసాగింది. ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ జయంతి నినాదాలతో ప్రాంతం మార్మోగించారు. అనంతరం సండ్ర వెంకట వీరయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక కుల నాయకుడు కాదని, దేశానికి మార్గదర్శకుడైన మహానేత అని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సత్తుపల్లిలో తన ఎమ్మెల్యే హయాంలో 37 లక్షల రూపాయల వ్యయంతో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడం తనకు గర్వకారణమని తెలిపారు. అంబేద్కర్ చూపించిన మార్గంలో నడుస్తూ సమాన హక్కులు అందరికీ కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments