జిల్లాలో ఘనంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు.
కేక్ కటింగ్, అన్నదానం నిర్వహించిన
జిల్లా కాంగ్రెస్ నాయకులు వేల్పుల మురళి.
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 1(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వేల్పుల మురళి ఎస్సీ కాలనీలో కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైరాలోని అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వేల్పుల మురళి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము.
నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం తపన పడే మనిషి అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే మనిషి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


Comments