అహ్మద్‌గూడలో దాంపత్య విభేదాలు విషాదాంతం

అహ్మద్‌గూడలో దాంపత్య విభేదాలు విషాదాంతం

– డాక్టర్ ఆత్మహత్య

_భార్య ఫిర్యాదు, తండ్రి ఆరోపణలతో రెండు కేసులు నమోదు 

– అన్ని కోణాల్లో దర్యాప్తు

కీసర, ఏప్రిల్  01(తెలంగాణ ముచ్చట్లు)

మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోకీసర మండలంలోని అహ్మద్‌గూడలో దాంపత్య విభేదాలు ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చాయి. శ్రీ లక్ష్మీ ఎన్‌క్లేవ్‌కు చెందిన పి. వీణపాణి మరియు ఆమె భర్త డా. పసల జోసెఫ్ వినోద్ కుమార్ మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 31న వీణపాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కీసర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.అదే రోజు సాయంత్రం మృతుడి తండ్రి పసల ఆరోగ్యమయ్య పోలీస్ స్టేషన్‌కు హాజరై, తన కుమారుడు జోసెఫ్ వినోద్ కుమార్ (40) తన భార్య చేత మానసిక వేధింపులకు గురై, రాంపల్లి దయ్యారా ఔటర్ రింగ్ రోడ్ వద్ద తన కారులో గుర్తుతెలియని ఇంజెక్షన్ ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ రెండు కేసులను అనుసంధానించి దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని కోణాల్లో పరిశీలించి, సాక్ష్యాధారాల ఆధారంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కీసర పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి అంజనేయులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్1(తెలంగాణ ముచ్చట్లు) క్షణికావేశంలో భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేల రూపాయలు జరిమానా విదిస్తూ 4వ అదనపు జిల్లా మరియు...
హుజురాబాద్ డివిజన్‌కు నూతన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
సిర్సపల్లి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ముమ్మరం
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం
స్టార్ హాస్పిటల్‌లో గురుక్కల్‌ను పరామర్శించిన ఎమ్మెల్యేలు
వార్డుల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి:రిహానా కమల్ పాషా.
నేరెడ్‌మెట్‌లో ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్ ప్రారంభం