33 ఫీట్ల రోడ్డును సర్వే చేసి హద్దులు సూచించాలి.
హాసన్ పర్తి,ఏప్రిల్ 01(తెలంగాణ ముచ్చట్లు):
హసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామం నుండి దామెర మండలం వెంకటాపురం గ్రామాల పూర్వకాలంలో ఉన్న 33 ఫీట్ల రోడ్డును సర్వే చేసి హద్దులు సూచించాలని ఆయా గ్రామాల రైతులు హసన్ పర్తి మండల తహసిల్దార్ పూజారి కిరణ్ కుమార్ కు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ బండి రజనీ కుమార్ తో కలిసి వినతి పత్రం అందజేశారు. వంగపహాడ్ గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 324 నుండి దామెర మండలం వెంకటాపురం గ్రామాల శివారు సరిహద్దుల వరకు పూర్వకాలంలో నక్షలో ఉన్న 33 ఫీట్ల రోడ్ ప్రస్తుతం ఆక్రమణకు గురైందని వెంటనే దీనిపై సర్వే చేసి హద్దులు సూచించి రోడ్డును పునరుద్ధరించాలని ఆయా గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు మండలానికి చేరుకొని తాహ సిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మార్వో సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి వెంటనే సర్వే చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జట్టి రవీందర్,రాజగోపాల్ రెడ్డి,శంకర్ రెడ్డి,చేరాలు, కుమార్,సారయ్య,రాజ్ కుమార్,విక్రమ్,బిక్షపతి, రాజు,సూరయ్య,స్వామి,రవి,బిఆర్ఎస్వి కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్ డాక్టర్ జట్టి రాజేందర్,ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.


Comments