కంఠమయ్య గుడి అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేయాలి
_మేడ్చల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి
Views: 3
On
కుషాయిగూడ, ఏప్రిల్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
కుషాయిగూడలో గౌడ కులస్థుల ఆరాధ్యదైవంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కంఠమహేశ్వర స్వామి (కంఠమయ్య) ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆలయంలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆలయ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ వినతిపై సానుకూలంగా స్పందిస్తూ, త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ సీనియర్ నాయకులు పాండల శివకుమార్ గౌడ్, బీఆర్ఎస్ అధ్యక్షులు నేమురి మహేష్ గౌడ్, తాళ్ల వెంకటేష్ గౌడ్, బుడంపల్లి రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
01 Apr 2026 22:23:41
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్1(తెలంగాణ ముచ్చట్లు)
క్షణికావేశంలో భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేల రూపాయలు జరిమానా విదిస్తూ 4వ అదనపు జిల్లా మరియు...


Comments