జేవీఆర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన.
విద్యార్థులతో మాట్లాడిన వైస్ చైర్పర్సన్ సుమలత.
Views: 31
On
సత్తుపల్లి, మార్చి 30 (తెలంగాణ ముచ్చట్లు):
పట్టణంలోని ప్రభుత్వ జేవీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న విద్యా దీక్ష కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజన పథకాన్ని సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బొంతు సుమలత వేణు పరిశీలించారు. కళాశాలను సందర్శించిన ఆమె, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ తదితర అంశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి భోజనంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, విద్యార్థుల ఆరో
గ్యం దృష్ట్యా నాణ్యమైన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 Mar 2026 17:53:07
సత్తుపల్లి, మార్చి 30(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి సింగరేణి క్వార్టర్స్ ప్రాంతంలోని జామాయిల్ తోటలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. స్థానికులు గమనించి...


Comments