యువత ఐఏఎస్, ఐపీఎస్ సాధనపై దృష్టి పెట్టాలి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్లో సివిల్ సర్వీసెస్ అవగాహన సదస్సు
ఉప్పల్, మార్చి 21 (తెలంగాణ ముచ్చట్లు)
యువత ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసులను సాధించడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచించారు. సివిల్ సర్వీసుల ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం లభించడంతో పాటు సమాజంలో గౌరవం, ఉన్నత స్థానం పొందవచ్చని ఆయన అన్నారు.బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిగ్నేచర్ ఐఏఎస్ అకాడెమీతో కలిసి మార్చి 22 (ఆదివారం) సివిల్ సర్వీసెస్ పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సు పోస్టర్ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, భారాసా నాయకులు సాయిజెన్ శేఖర్, సిగ్నేచర్ ఐఏఎస్ అకాడెమీ డైరెక్టర్ ఆర్.ఎస్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ, బిఎల్ఆర్ ట్రస్ట్ గతంలో గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ అందించి అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా సహకరించిందన్నారు. అలాగే నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఐదు సంవత్సరాలపాటు ఉచిత విద్యను అందిస్తూ డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.సిగ్నేచర్ ఐఏఎస్ అకాడెమీ డైరెక్టర్ ఆర్.ఎస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అవగాహన సదస్సు ఉప్పల్లోని అకాడెమీ ప్రాంగణంలో ఆదివారం ఉదయం 11 గంటలకు జరుగుతుందని తెలిపారు. పాల్గొనదలిచిన విద్యార్థులు 8639882839 నంబర్కు మెస్సేజ్ చేసి ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు.


Comments