ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ నామ
ఖమ్మం బ్యూరో, మార్చి 18(తెలంగాణ ముచ్చట్లు )
తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగ ఉగాది సందర్భంగా బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సంతోషం కలగాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కొత్త సంవత్సరాన్ని సరికొత్త ఆశయాలు, లక్ష్యాలతో ప్రారంభించి విజయాలను సాధించాలని తెలిపారు. రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, రైతులు, కార్మికులు, విద్యార్థులు, వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు. ఉగాది పండుగ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్న ఆయన, ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మనిషి జీవితంలోని సుఖదుఃఖలు, విజయాపజయాలను సూచిస్తాయని వివరించారు. ప్రతి పరిస్థితిని సమానంగా స్వీకరించే ధైర్యం, సహనం మనలో పెంపొందాలని తెలియజేశారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఆనందం, సౌభాగ్యం నెలకొనాలని, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగి, సమాజ అభివృద్ధి దిశగా కృషి చేయాలని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.


Comments