బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 

రడపాక డానియెల్,కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ సీనియర్ నాయకులు 

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 

హైదరాబాద్,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు):

హైదరాబాద్ బోడుప్పల్‌లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు నివాసంపై జరిగిన దాడి ఘటనను స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక డానియల్ ఖండించారు. ఈ ఘటన అనవసర ఉద్రిక్తతలకు దారితీసే విధంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.మందుల సామేలు చేసిన వ్యాఖ్యలను కారణంగా చూపుతూ బిజెపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. చిన్న విషయాలను పెద్దగా చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటి చర్యలు సమాజంలో విభేదాలను పెంచుతాయని అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విభేదాలు రేకెత్తించడం తగదని, శాంతి, సామరస్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని రడపాక డానియల్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మందుల సామేలు కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణలో బంజారాలకు అన్యాయం  తెలంగాణలో బంజారాలకు అన్యాయం 
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం
సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!
వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా
పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం