వన్నిగూడలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక
_అధ్యక్షుడిగా రాగుల గణేష్ ముదిరాజ్ ఏకగ్రీవ ఎన్నిక
కీసర, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):
కీసర మండలం వన్నిగూడ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం సంప్రదాయం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడు, కార్యదర్శులను ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా ఈ ఎన్నికలు నిర్వహించినట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు.నూతన అధ్యక్షుడిగా రాగుల గణేష్ ముదిరాజ్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా రాగుల బాలకృష్ణ, రెడ్డబోయిన మధుకర్ ముదిరాజ్, దేసు పవన్ కుమార్ ముదిరాజ్ ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రెడ్డబోయిన మహేష్ ముదిరాజ్, ఖజాంచిగా ఎర్ర వెంకటేష్ ముదిరాజ్ బాధ్యతలు స్వీకరించారు.కార్యదర్శులుగా రాగుల రాజ్ కుమార్ ముదిరాజ్, రెడ్డబోయిన భుక్షపతి, రాగుల లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పల్లెపాటి లక్ష్మయ్య ముదిరాజ్, అబ్రబోయిన వెంకటేష్ ముదిరాజ్, కుక్కదువ్వు భాస్కర్ ముదిరాజ్ ఎంపికయ్యారు.సలహాదారులుగా అంద్యాల బాలకృష్ణ ముదిరాజ్, రాయరపురం రమేష్ ముదిరాజ్లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు రాగుల గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, సభ్యులు మరియు గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధికి ముందుకు సాగుతామని పేర్కొన్నారు.


Comments