జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం

మహబూబాబాద్,మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి జాటోత్ లచ్చా నాయక్ (95) కన్నుమూశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
లచ్చా నాయక్ పార్ధీవ దేహాన్ని పలువురు నాయకులు, బంధుమిత్రులు సందర్శించి పూలమాలలు అర్పిస్తూ నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వి ఎన్ నాయక్, భానోత్ వెంకన్న, బాదావత్ బాలాజీ, రామన్న, జాటోత్ కిషన్ నాయక్, రాష్ట్ర ట్రైబల్ జర్నలిస్టు యూనియన్ సంయుక్త కార్యదర్శి లావుడియా పల్లవి రాజు నాయక్, పోరిక రమేష్ నాయక్, ప్రొఫెసర్ మూడు రమేష్, సీనియర్ జర్నలిస్ట్ భూక్య శ్రావణ్ కుమార్ తదితరులు నివాళులు అర్పించారు.అనంతరం జాటోత్ హుస్సేన్ నాయక్‌ను కలిసి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అంత్యక్రియలలో కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.లచ్చా నాయక్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణలో బంజారాలకు అన్యాయం  తెలంగాణలో బంజారాలకు అన్యాయం 
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం
సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!
వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా
పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం