పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యసాధ్యం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివశంకర్
_ఎన్ఎస్ఎస్ ముగింపు కార్యక్రమంలో యువతకు ప్రేరణ
_ట్రాఫిక్ భద్రతపై అవగాహన కల్పన
కుషాయిగూడ, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):
పట్టుదలతో కృషి చేస్తే అనుకున్న గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చని జవహర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివశంకర్ గౌడ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) కార్యక్రమం ముగింపు వేడుకలు కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ జై జవాన్ కాలనీ, ఈసీఐఎల్ ప్రాంతాల్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్స్పెక్టర్ శివశంకర్ హాజరై మాట్లాడుతూ, జీవితంలో ఓటములు సహజమని, వాటితో నిరుత్సాహపడకుండా గెలుపు కోసం కృషి చేయాలని యువతకు సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణ రక్షణకు కీలకమని చెప్పారు. “బ్రతికి సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ముఖ్యమని” ఆయన సూచించారు.అలాగే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ భద్రతపై అవగాహన పెంచుతున్నామని తెలిపారు. యువత ఏ రంగంలోనైనా సాధించగల సామర్థ్యం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.విశిష్ట అతిథి లయన్ జ్యోతిర్మయాచారి మాట్లాడుతూ, విద్య అనేది కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా, మానవీయ విలువలను పెంపొందించేలా ఉండాలని అన్నారు.సమాజానికి ఉపయోగపడే విధంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కరుణాసాగర్, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమాదేవి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అశోక్, ప్రొఫెసర్ డాక్టర్ నరేష్, ఎఎస్ఐ గోపాల్ గౌడ్, విశ్వకర్మ ట్రస్ట్ ప్రతినిధులు కలకొండ బిక్షపతి, మారోజు నరసింహచారి తదితరులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.


Comments