బోగ్గారపు రామయ్య కుటుంబ సభ్యులకు మాజీ ఎంపీ నామ పరామర్శ
Views: 5
On
ఖమ్మం బ్యూరో, మార్చి 17(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం కార్పొరేషన్, ఇల్లందు రోడ్ లోని ప్రగతి ప్రైడ్ కాలనీకి చెందిన బొగ్గారపు రామయ్య ఇటీవల మరణించిన విషయం విధితమే కాగా మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు వారి స్వగృహానికి వెళ్లి రామయ్య చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు. రామయ్య అల్లుడు మందటి నరేష్ చౌదరి, కుమార్తె కౌముదిని, కుమారులు రణధీర్, అభినవ్ తో పాటు వారి కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ నామ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్ తో పాటు పొట్ల హరినాధ్ బాబు, మాజీ పిఏసీఎస్ చైర్మన్ మన్నే బాలకృష్ణ, గుంటుపల్లి రఘు బాబు, యనమద్ది రాధాకృష్ణ, దేవభక్తని హేమంత్, బీఆర్ఎస్ నాయకులు వాకదాని కోటేశ్వరరావు, రేగళ్ల కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
17 Mar 2026 22:28:09
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...


Comments