కళలు మానసిక ఆనందాన్నిస్తాయి

పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు 

కళలు మానసిక ఆనందాన్నిస్తాయి

వనపర్తి,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెబ్బేర్‌లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో జిల్లా రంగస్థల కళాకారులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పాల్గొని కళాకారులను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళలు మరియు సాహిత్యం మనిషికి మానసిక ఆనందాన్ని కలిగిస్తాయని తెలిపారు. కళ కళ కోసం కాదు, ప్రజల కోసం అన్న నానుడిని అనుసరించి కళాకారులు ప్రజల ఉల్లాసం కోసం తమ ప్రతిభను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.గత యాభై సంవత్సరాలుగా సరస్వతీ కళా సమితి ద్వారా పెబ్బేర్ కళాకారులు పౌరాణిక, జానపద, చారిత్రక నాటకాలను ప్రదర్శిస్తూ రంగస్థల కళకు సేవలందించడం అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎల్. ఉమామహేశ్వర్, కార్యదర్శి సర్వారెడ్డి, సితార వెంకటేశ్వర్లు తదితరులను శాలువాలు, జ్ఞాపకాలతో సత్కరించారు.కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు బైరోజు చంద్రశేఖర్, రాములు, గోవర్ధన్ చారి, శ్రీనివాస్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణలో బంజారాలకు అన్యాయం  తెలంగాణలో బంజారాలకు అన్యాయం 
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం
సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!
వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా
పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం