ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య

వరంగల్,మార్చి10(తెలంగాణ ముచ్చట్లు): 

న్యూఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీ సీనియర్ నాయకురాలు ఎర్రబెల్లి స్వర్ణను అధిష్ఠానం నియమించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్యతో కలిసి ఎర్రబెల్లి స్వర్ణ మల్లికార్జున ఖర్గేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఎర్రబెల్లి స్వర్ణ పేర్కొన్నారు. తెలంగాణలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!