నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.

 హసన్ పర్తి  కార్పొరేషన్ ఆఫీసు ముందు బై టయింపు.

నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.

 హసన్ పర్తి,మార్చ్ 10( తెలంగాణ ముచ్చట్లు):

 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్ హాసన్ పర్తి మండల కేంద్రంలోని రాంనగర్ కు చెందిన మహిళలు త్రాగు నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రోజున ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఎండాకాలం ఆరంభంలోనే త్రాగునీటి సమస్య తీవ్ర తరం కావడంతో సమస్య పరిష్కరించాలని ఆ ప్రాంతానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. కాలనీలో దాదాపు లక్ష జనాభా ఉంటుందని వేసవికాలం ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మునుముందు తాగునీటి సమస్య తీవ్రతరం అవుతుందని సంబంధిత అధికారులు,రాజకీయ నాయకులు స్పందించి సమస్య తీవ్రతరం కాకముందే పరిష్కరించాలని కోరారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై దేవేందర్ ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!