నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
హసన్ పర్తి కార్పొరేషన్ ఆఫీసు ముందు బై టయింపు.
హసన్ పర్తి,మార్చ్ 10( తెలంగాణ ముచ్చట్లు):
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్ హాసన్ పర్తి మండల కేంద్రంలోని రాంనగర్ కు చెందిన మహిళలు త్రాగు నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రోజున ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఎండాకాలం ఆరంభంలోనే త్రాగునీటి సమస్య తీవ్ర తరం కావడంతో సమస్య పరిష్కరించాలని ఆ ప్రాంతానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. కాలనీలో దాదాపు లక్ష జనాభా ఉంటుందని వేసవికాలం ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మునుముందు తాగునీటి సమస్య తీవ్రతరం అవుతుందని సంబంధిత అధికారులు,రాజకీయ నాయకులు స్పందించి సమస్య తీవ్రతరం కాకముందే పరిష్కరించాలని కోరారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై దేవేందర్ ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


Comments