కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!

కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!

_జవహర్ నగర్ సర్వే నం.415లో తిరిగి నిర్మాణాలు 

– యంత్రాంగం మౌనంపై స్థానికుల ఆగ్రహం

కాప్రా, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):

అక్రమ కట్టడాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలో గతంలో ఆక్రమణగా గుర్తించి కూల్చివేసిన స్థలంలోనే తిరిగి నిర్మాణాలు ప్రారంభం కావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకసారి అక్రమమని తేల్చిన స్థలంలో మళ్లీ పనులు సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అప్పట్లో హడావుడి… ఇప్పుడు నిశ్శబ్దం జవహర్ నగర్ సర్వే నంబర్ 415లో రహదారిని ఆక్రమించి భవనం నిర్మిస్తున్నారని గతంలో స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు గతేడాది ఫిబ్రవరి 17న క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అది ఆక్రమణేనని నిర్ధారించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో భవనాన్ని కూల్చివేశారు. ప్రభుత్వ భూములు, ప్రజా మార్గాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో అధికారులు ప్రకటించారు.మళ్లీ మొదలైన నిర్మాణం కూల్చివేత జరిగిన నెల రోజులకే అదే ప్రదేశంలో మళ్లీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పునాదులు వేసి గోడలు నిర్మిస్తున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. సామాన్యులు చిన్నపాటి నిర్మాణం చేపట్టినా నిబంధనల పేరుతో ఆపే యంత్రాంగం, బహిరంగంగా రహదారిని ఆక్రమిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ IMG-20260310-WA0132నిర్మాణంపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆక్రమణలను శాశ్వతంగా అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!