అవుట్ సోర్సింగ్ డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహించిన టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం డిపో
ఖమ్మం బ్యూరో, మార్చి 10(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ఖమ్మం డిపోలో అవుట్ సోర్సింగ్ డ్రైవర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా డ్రైవర్లకు ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించే విధానం, ట్రాఫిక్ నిబంధనలు పాటించే అవసరం, మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని అవగాహన కల్పించారు. అలాగే డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రయాణికులు కోరిన చోట ఎక్కించుకోవడం, దింపడం ద్వారా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ గౌతమి, డిపో ఎంఎఫ్ ప్రవీణ్, డి ఐ అంజయ్య, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments