పరిసరాల పరిశుభ్రతతోనే మానవాళి మనుగడ

పరిసరాల పరిశుభ్రతతోనే మానవాళి మనుగడ

_కాప్రా చెరువును సందర్శించిన మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి

_పలు సూచనలు చేసిన ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా

కాప్రా, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చెరువుల పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని మంగళవారం కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా చెరువు వద్ద నిర్వహించారు. చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని మల్కాజిగిరి జిహెచ్ఎంసి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఎంటమాలజీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం సుమారు 125 మంది ఈ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని చెరువు పరిసరాలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ చెరువులు సహా నీటి వనరులను పరిరక్షించడం, పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చెరువుల పరిశుభ్రతతో ఆరోగ్యకరమైన జీవన విధానం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమాలకు సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, డీఈ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) రవి, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, ఎంటమాలజీ ఏఈ డి.రమేష్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, యూబీడీ విభాగం సిబ్బంది, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.IMG-20260310-WA0098

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!