పేదప్రజల పక్షపాతి పంది నారాయణ
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి రవీంద్రబాబు
ఖమ్మం బ్యూరో, మార్చి 10(తెలంగాణ ముచ్చట్లు)
పేదప్రజల హక్కుల కోసం పోరాడిన పంది నారాయణ చిరస్మరణియుడని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి రవీంద్రబాబు పేర్కొన్నారు. నాగిలిగొండ గ్రామంలో మంగళవారం కామ్రేడ్ పంది నారాయణ 38వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రవీంద్రబాబు మాట్లాడుతూ ఆనాటి భూస్వామ్య గుండాల చేతిలో హతమైన అమరజీవి నారాయణ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో కమ్యునిస్టుగా మారి గ్రామంలో కూలి రేట్ల పెంపు కోసం, అనేక భూపోరాటాలు నిర్వహించి జైలు జీవితం గడిపారన్నారు. పేద ప్రజలకు భూపంపిణీ, ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాటాలను నిర్వహించిన నారాయణను భూస్వామ్య గూండాలు దారుణంగా హత్యచేసారన్నారు. ఆయన మరణం నాగిలిగొండ పరిసర గ్రామల్లో ఒక చైతన్యాన్ని తీసుకువచ్చిందన్నారు. పేద ప్రజల పక్షాన నిలబడి చేసే పోరాటాలే నారాయణ కు మనమిచ్చే నిజమైన ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పావులూరి మల్లిఖార్జునరావు నాయకులు పదిమల వెంకటనర్సయ్య, శాఖ కార్యదర్శి చాట్ల రమేష్, బాబు, పంది నాగేశ్వరరావు, శేఖర్, అరికోట్ల భాస్కర్, సుధాకర్, షైక్, చిన్న జానీ, షేక్ హుస్సేన్, ఫిలిఫ్ తదితరులు పాల్గొన్నారు.


Comments