పేదప్రజల పక్షపాతి పంది నారాయణ

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి రవీంద్రబాబు

పేదప్రజల పక్షపాతి పంది నారాయణ

ఖమ్మం బ్యూరో, మార్చి 10(తెలంగాణ ముచ్చట్లు)

పేదప్రజల హక్కుల కోసం పోరాడిన పంది నారాయణ చిరస్మరణియుడని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి రవీంద్రబాబు పేర్కొన్నారు. నాగిలిగొండ గ్రామంలో మంగళవారం కామ్రేడ్ పంది నారాయణ 38వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రవీంద్రబాబు మాట్లాడుతూ ఆనాటి భూస్వామ్య గుండాల చేతిలో హతమైన అమరజీవి నారాయణ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో కమ్యునిస్టుగా మారి గ్రామంలో కూలి రేట్ల పెంపు కోసం, అనేక భూపోరాటాలు నిర్వహించి జైలు జీవితం గడిపారన్నారు. పేద ప్రజలకు భూపంపిణీ, ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాటాలను నిర్వహించిన నారాయణను భూస్వామ్య గూండాలు దారుణంగా హత్యచేసారన్నారు. ఆయన మరణం నాగిలిగొండ పరిసర గ్రామల్లో ఒక చైతన్యాన్ని తీసుకువచ్చిందన్నారు. పేద ప్రజల పక్షాన నిలబడి చేసే పోరాటాలే నారాయణ కు మనమిచ్చే నిజమైన ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పావులూరి మల్లిఖార్జునరావు నాయకులు పదిమల వెంకటనర్సయ్య, శాఖ కార్యదర్శి చాట్ల రమేష్, బాబు, పంది నాగేశ్వరరావు, శేఖర్, అరికోట్ల భాస్కర్, సుధాకర్, షైక్, చిన్న జానీ, షేక్ హుస్సేన్, ఫిలిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!