తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు

తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు

_లక్షలాది భక్తులతో ఆలయం కిటకిట

_రెండు లక్షల మందికి ఉచిత అన్నప్రసాద వితరణ

హైదరాబాద్, మార్చి 9 (తెలంగాణ ముచ్చట్లు):

తిరునల్లార్లోని ప్రసిద్ధ ధర్బరణ్యేశ్వర స్వామి ఆలయంలో శని పేర్చి పవిత్ర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కుంభ రాశి నుంచి మీన రాశికి శని గ్రహం మారిన సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుంచి 45 రోజులపాటు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు.ఉత్సవాల ప్రారంభం సందర్భంగా మార్చి 6, 7, 8 తేదీలలో సుమారు ఆరు లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించి శని భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ శని పేర్చి ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు.ఆలయ 27వ పీఠాధిపతి శ్రీ లా శ్రీ కైలై మాసిలామణి దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్య స్వామిగళ్ ఆశీర్వాదాలతో కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా తులసమ్మ చారిటబుల్ ఫౌండేషన్ మరియు సోలిస్ ఐ హాస్పిటల్ చైర్మన్ నందనపాటి రాము ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల మంది భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఐదోసారి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అలాగే ఆలయంలో హోమాలు, శని భగవానుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా నందనపాటి రాము కుటుంబ సభ్యులు, సోలిస్ హాస్పిటల్ సిబ్బంది భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శివ శ్రీ టి. రాజస్వామి నాథశివాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అరికపూడి గాంధీ, భీరం హరివర్ధన్ రెడ్డి, సైదిరెడ్డి, లక్ష్మీ సౌజన్య, ఇషితా రాఠి, కొత్త రామారావు తదితరులు పాల్గొన్నారు.IMG-20260309-WA0233

Tags:

Post Your Comments

Comments

Latest News

కలెక్టరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కలెక్టరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మేడ్చల్–మల్కాజిగిరి, మార్చ్ 9 (తెలంగాణ ముచ్చట్లు): మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, సమాజంలో వారికి సమాన గౌరవం మరియు హక్కులు కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా...
డాక్టర్ పత్తిపాటి లక్ష్మీకాంతమ్మకు ‘ఉమెన్ ఆఫ్ ఎక్సలెంట్’ అవార్డు 
మహిళలే సమాజానికి శక్తి – మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగినుల ఘన సన్మానం
ప్రమాదాలకు చెక్… ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి 
విద్యార్థులే ఉపాధ్యాయులు… సందడిగా స్వయం పరిపాలన దినోత్సవం
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వాల్మీకి సంఘం
కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు