టిబిజేఏ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ గుప్తాను పరామర్శించిన
ఖమ్మం జిల్లా బీజేపీ కోశాధికారి కొణతం లక్ష్మీనారాయణ
ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం జిల్లా బీజేపీ కోశాధికారి కొణతం లక్ష్మీనారాయణ టిబీజేఏ జిల్లా అధ్యక్షుడు వందనపు సామ్రాట్ గుప్తాను ఆయన స్వగృహంలో పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలుసుకున్న కొణతం లక్ష్మీ నారాయణ, సామ్రాట్ గుప్తాకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో ఎప్పుడూ చురుకుగా ఉండే జర్నలిస్ట్ నాయకుడుగా మరింత ఉత్సాహంతో తిరిగి కార్యకలాపాల్లో పాల్గొనాలని సూచించారు.
అలాగే సామ్రాట్ గుప్తా కుమారుడు కూడా ప్రమాదానికి గురైన విషయం తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొంటూ, వైద్యుల సూచనల ప్రకారం విశ్రాంతి తీసుకుని పూర్తిస్థాయిలో కోలుకోవాలని కొణతం లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.


Comments