10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ...

10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ...

ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు)

 చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలో అనంతసాగర్ యంగ్ వారియర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పబ్లిక్ పరీక్షల కోసం అవసరమైన పరీక్ష సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నారపోగు వీరభద్రం, వేర్పుల రామకృష్ణ, దుమాల రామారావు మరియు ఎస్ వి ఎన్  పవన్  ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు అనంతసాగర్ గ్రామ ప్రైమరీ స్కూల్లో జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులకు పాడ్లు, పెన్నులు, స్కేలు, పెన్సిళ్లు పంపిణీ చేయడంతో పాటు పబ్లిక్ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలనే అంశాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జడ ప్రమీల పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.అలాగే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మర్రి భాస్కర్  ( ఎస్.ఏ తెలుగు), ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ వి ఎన్ పవన్  (ఎస్ ఏ భౌతిక శాస్త్రం), జానపాటి ఉపేందర్  (ఎస్ ఏ సోషల్ స్టడీస్) పాల్గొని విద్యార్థులకు పరీక్షలపై సూచనలు అందించారు. యూత్ అసోసియేషన్ సభ్యులు కన్నెగంటి వీరయ్య, వేర్పుల సైదులు, గడ్డం శ్రవణ్ కుమార్, వేర్పుల ఉపేందర్, నారపోగు వీరభద్రం తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టిబిజేఏ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ గుప్తాను పరామర్శించిన టిబిజేఏ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ గుప్తాను పరామర్శించిన
ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు) ఖమ్మం జిల్లా బీజేపీ కోశాధికారి  కొణతం లక్ష్మీనారాయణ టిబీజేఏ జిల్లా అధ్యక్షుడు వందనపు సామ్రాట్ గుప్తాను ఆయన స్వగృహంలో పరామర్శించారు....
అధికారికంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి
మణిగిళ్ల ఉన్నత పాఠశాల వార్షికోత్సవానికి జిల్లా కలెక్టర్‌కు ఆహ్వానం
15వ బెటాలియన్‌లో దుద్దీల్ల శ్రీపాదరావు జయంతి.
స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో హోలీ సంబురాలు
డాక్టర్ కాపా చంద్రకళను  సన్మానించిన లయన్స్ క్లబ్ జిల్లా  320ఈ గవర్నర్..
పేదల గుడిసెల కూల్చివేత అమానుషం