ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను సన్మానించిన పోలీస్ కమిషనర్
Views: 5
On
ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు)
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలందించారారని పోలీస్ కమీషనర్ కొనియాడారు. విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఉద్యోగ విరమణ పొందిన వారు వి. చంద్రశేఖర రావు (ఎస్సై ) యం. రామ్ లింగారెడ్డి (ఎస్సై ) జీ. డానియల్ ప్రభుదాస్ (ఎస్సై )ఈ కార్యక్రమంలో ఆర్ఐ కామరాజు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Mar 2026 21:25:07
ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం జిల్లా బీజేపీ కోశాధికారి కొణతం లక్ష్మీనారాయణ టిబీజేఏ జిల్లా అధ్యక్షుడు వందనపు సామ్రాట్ గుప్తాను ఆయన స్వగృహంలో పరామర్శించారు....


Comments