తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్గా ఎండి రహీం నియామకం
హైదరాబాద్,మార్చి01(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్గా ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి ఎండి రహీంను నియమిస్తూ నియామక పత్రాన్ని సంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి అందజేశారు. తెలంగాణ ఉద్యమకారుల మీడియా సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హాజరైన మలిదశ ఉద్యమకారుల సమక్షంలో ఈ నియామకం జరిగింది.ఈ సందర్భంగా ఎండి రహీం మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కన్వీనర్ బాధ్యతలు అప్పగించినందుకు డాక్టర్ పిడమర్తి రవికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన సంక్షేమ ఫలాలు సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల హామీలలో భాగంగా ఉద్యమకారులకు ప్రకటించిన 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, గుర్తింపు కార్డు వంటి అంశాలు అమలు అయ్యే వరకు మలిదశ ఉద్యమకారులను ఐక్యం చేసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు.రానున్న రోజుల్లో ఉద్యమకారులు ఐక్యంగా నిలిచి రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే ఉద్యమకారుల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.


Comments