సబ్సిడీ,వ్యవసాయ యంత్ర పరికరాముల పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి 

సబ్సిడీ,వ్యవసాయ యంత్ర పరికరాముల పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి 

వేలేరు, మార్చ్ 09 (తెలంగాణ ముచ్చట్లు):

ధర్మసాగర్ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ  కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం హన్మకొండ జిల్లా పరిధిలోని ధర్మసాగర్, వేలేరు మండలాలకు సంబందించిన 12మంది లబ్ధిదారులకు 50శాతం సబ్సిడీపై రోటవెటర్స్, బేయిలర్స్, స్ప్రేయర్స్ వంటి వ్యవసాయ పనిముట్లను లబ్ధిదారులకు పంపిణి చేశారు.అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ
ధర్మసాగర్, వేలేరు మండలాలు పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడిన మండలాలని కావున సబ్సిడీ యంత్రాల కేటాయింపులో ఈ రెండు మండలాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారులను కోరారు. డ్రోన్ స్ప్రేయర్స్ లను వ్యక్తులకు కాకుండా రైతు సంఘాలకు గాని, మహిళా సంఘాలకు గాని గ్రామానికి ఒకటి చొప్పున కేటాయించాలని అన్నారు. ప్రభుత్వాలు రైతులకు ఎంత చేసినా తక్కువే నని రైతులు పండించిన పంట చేతికి వచ్చిన నోటికి రావడం లేదని అన్నారు. ఎన్ని చేసినా వ్యవసాయం లాభసాటిగా మారడం లేదని తెలిపారు. స్వామినాధన్ కమిషన్ నివేదిక ను యథాతదంగా అమలు చేయాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఏడిఏవో, ఏవోలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.IMG-20260309-WA0267

Tags:

Post Your Comments

Comments

Latest News

కలెక్టరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కలెక్టరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మేడ్చల్–మల్కాజిగిరి, మార్చ్ 9 (తెలంగాణ ముచ్చట్లు): మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, సమాజంలో వారికి సమాన గౌరవం మరియు హక్కులు కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా...
డాక్టర్ పత్తిపాటి లక్ష్మీకాంతమ్మకు ‘ఉమెన్ ఆఫ్ ఎక్సలెంట్’ అవార్డు 
మహిళలే సమాజానికి శక్తి – మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగినుల ఘన సన్మానం
ప్రమాదాలకు చెక్… ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి 
విద్యార్థులే ఉపాధ్యాయులు… సందడిగా స్వయం పరిపాలన దినోత్సవం
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వాల్మీకి సంఘం
కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు