లారీ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు
ఎల్కతుర్తి. ఫిబ్రవరి 24(తెలంగాణ ముచ్చట్లు )
ఎల్కతుర్తి మండల కేంద్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన పోలీస్ స్టేషన్ సమీపంలోని కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
ఎస్సై అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కనుకుల గిద్ద గ్రామానికి చెందిన తోకల ప్రభాకర్ రెడ్డి, రేణుక దంపతులు పనిమీద హనుమకొండకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో రేణుకకు తీవ్ర గాయాలు కాగా, ప్రభాకర్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని, గాయపడిన రేణుకను 108 అంబులెన్స్ ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Comments