మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ప్రజాప్రతినిధులు
Views: 4
On
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 22(తెలంగాణ ముచ్చట్లు)
నూతనంగా ఎన్నికైన సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఆదివారం ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, పట్టణాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా మంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
22 Feb 2026 21:29:10
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్...


Comments