ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఆదివారం కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉద్యమకాలంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. అలాగే ఉద్యమకారుల కుటుంబాలకు ఉపాధి, ఆర్థిక భద్రత కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తెలంగాణ సాధనలో తమవంతు పాత్ర పోషించిన ఉద్యమకారులను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో ఫోరం రాష్ట్ర మీడియా కన్వీనర్ దొమ్మటి కిరణ్ కుమార్ రావు, నాయకులు దయానంద్, జగన్, ఆదిలక్ష్మి, నాగజ్యోతి, భూపాల్, భాస్కర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్...
మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ప్రజాప్రతినిధులు
కలకాలం కలిసి ఉండాలి...
వార్డుల్లో తిరగండి.. సమస్యలు తీర్చండి!
ట్రస్మా డివిజన్ బాధ్యులకు సత్కారం.
రామచంద్రపురంలో సాగునీటి పనులకు శ్రీకారం.!
ఇందిరమ్మ గృహాలతో నిరుపేదల సొంతింటి కల సాకారం