తేజస్విని రెడ్డి వివాహానికి హాజరైన ఐ ఎన్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసు
Views: 3
On
వనపర్తి,ఫిబ్రవరి21(తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్ రాంమంతపూర్కు చెందిన పెసరకాయల స్వప్న కాంతి రెడ్డి ఏకైక కుమార్తె తేజస్విని రెడ్డి వివాహం నగరంలోని నాగోల్ ప్రాంతంలో ఉన్న కళ్యాణ లక్ష్మి గార్డెన్లో ఘనంగా జరిగింది.బంధుమిత్రులు, స్నేహితులు, ఆహ్వానితుల సమక్షంలో వివాహ వేడుకలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐ ఎన్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.కుటుంబ సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.అలాగే పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి, ఎం. బాలరాజ్, కృష్ణయ్య, ఏర్పుల వెంకన్న, డి. అంజన్న, జి. కుర్మయ్య, నారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
21 Feb 2026 22:02:24
హనుమకొండ,ఫిబ్రవరి 21(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా గిరిజన భవనంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. సేవాలాల్ ఉత్సవ...


Comments