అడిషనల్ డీసీపీ (అడ్మిన్)ను కలిసిన ఎంపీజే బృందం

అడిషనల్ డీసీపీ (అడ్మిన్)ను కలిసిన ఎంపీజే బృందం

ఖమ్మం బ్యూరో, మార్చి 09(తెలంగాణ ముచ్చట్లు)

ఖమ్మం నగర పోలీస్ కమిషనరేట్‌లో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) బి. రామానుజం ను ఎంపీజే (ఎంపీజే) ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జేఐహెచ్ ప్రధాన కార్యాలయంలో, మార్చి 11న నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఎంపీజే బృందం ఆహ్వానించింది. దీనిపై డీసీపీ (అడ్మిన్ ) బి. రామానుజం సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఎంపీజే జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసిం సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల గురించి డీసీపీకి వివరించారు. అనంతరం ఎంపీజే బృందం తరఫున ఎంపీజే పరిచయ పుస్తకాన్ని డీసీపీ రామానుజంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసిం, జిల్లా కోశాధికారి ఎండి హకీమ్, సభ్యుడు అర్షీన్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .