అడిషనల్ డీసీపీ (అడ్మిన్)ను కలిసిన ఎంపీజే బృందం

అడిషనల్ డీసీపీ (అడ్మిన్)ను కలిసిన ఎంపీజే బృందం

ఖమ్మం బ్యూరో, మార్చి 09(తెలంగాణ ముచ్చట్లు)

ఖమ్మం నగర పోలీస్ కమిషనరేట్‌లో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) బి. రామానుజం ను ఎంపీజే (ఎంపీజే) ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జేఐహెచ్ ప్రధాన కార్యాలయంలో, మార్చి 11న నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఎంపీజే బృందం ఆహ్వానించింది. దీనిపై డీసీపీ (అడ్మిన్ ) బి. రామానుజం సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఎంపీజే జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసిం సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల గురించి డీసీపీకి వివరించారు. అనంతరం ఎంపీజే బృందం తరఫున ఎంపీజే పరిచయ పుస్తకాన్ని డీసీపీ రామానుజంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసిం, జిల్లా కోశాధికారి ఎండి హకీమ్, సభ్యుడు అర్షీన్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!