ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రతినిధులు ఎంపీ ఈటల ను మర్యాదపూర్వకంగా కలిసారు

ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రతినిధులు ఎంపీ ఈటల ను మర్యాదపూర్వకంగా కలిసారు

మేడ్చల్ మల్కాజ్గిరి, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు)

మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను ఎల్లంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి షామీర్‌పేటలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఎంపీకి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు.సమావేశంలో ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ వంటి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ ప్రజలు నమ్మకంతో గెలిపించిన నేపథ్యంలో ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని, సమయానికి పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను తీసుకురావడానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపాలిటీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.ఈ సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితం ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితం
ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి ఇంకా పదేళ్లు సిఎంగా  కొనసాగుతారు – తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి హైదరాబాద్,ఫిబ్రవరి25(తెలంగాణ ముచ్చట్లు):...
అగ్రకుల కులోన్మాదం అరికట్టకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది
నాగవరం ఉన్నత పాఠశాలలో ‘ఆర్ట్ ఆఫ్ ఆన్సరింగ్’ పై మోటివేషన్ కార్యక్రమం
మేఘన్న అభయ హస్తం – బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
పిల్లల ఆహారంలో నిర్లక్ష్యం అస్సలు వద్దు
ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రతినిధులు ఎంపీ ఈటల ను మర్యాదపూర్వకంగా కలిసారు
వల్లభాపూర్‌లో కల్లు గీత సంఘం ఎన్నికలు విజయవంతం